కరోనా వైరస్ కారణంగా ఎవరూ అతీతం కాకుండా అందరూ లాక్ డౌన్ కు పరిమితమైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొనడంతో క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులంద‌రూ ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. అయితే భార‌త టెన్నిస్ క్వీన్ సానియా మీర్జా ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా సోనియా పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ భార్య సమియాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 
 
సానియా మీర్జా ట్విట్టర్ ద్వారా ఎంతో ప్రేమతో సమియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. స్టార్ క్రికెటర్ అసద్ అలీ భారత సంతతికి చెందిన సమియాను గతేడాది వివాహం చేసుకున్నారు. సానియా మీర్జా లాక్ డౌన్ సమయాన్ని కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నానని పేర్కొన్నారు. సానియా తన ట్విట్టర్ ఖాతాలో ఆటను చాలా మిస్సవుతున్నానని... త్వరలోనే కోర్టులో అడుగుపెడతానని పేర్కొన్నారు. 
 
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత ఈ సంవత్సరం జనవరిలో సానియా టెన్నిస్ రాకెట్ పట్టారు. దేశంలో లాక్ డౌన్ వల్ల ఆమెకు మరోసారి విరామం దొరికింది. సెలబ్రిటీలు లాక్ డౌన్ సమయంలో వంటల వీడియోలను పోస్ట్ చేయడానికి కాకుండా పేదలకు సహాయపడే విధంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. సానియా మీర్జా పాక్ సీనియర్ బ్యాట్స్ మన్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గత ఆదివారానికి వీరి వివాహం జరిగి పదేళ్లు కావడంతో సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేసుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: