ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న కారణంగా ఐపీఎల్ వాయిదా వేసినట్లు బీసీసీఐ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని మే 3 వరకు పొడిగించింది. ఈ విధానాన్ని ముంబై పోలీసులు సమర్థించడం జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా చేసుకొని ట్వీట్  కూడా చేయడం జరిగింది. ఇక ఈ ట్వీట్ లో ఏముంది అన్న విషయానికి వస్తే... ఐపీఎల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి కామెంట్ కూడా రాయడం జరిగింది. 

 

IHG

దీనితో పాటు ఐపీఎల్ ని " (I)ndia (P)racticing (L)ockdown " అంటూ తెలిపింది. ఇక ఈ ట్వీట్ కి కూడా మంచి స్పందన లభించిందని చెప్పాలి. ఇక ఇందుకు కారణం కట్టడి చేసేందుకు ముంబై పోలీసులు బాగా శ్రమిస్తున్నారు అంటూ యునైటెడ్ ఇండియా గెలుస్తుంది అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా..  అవును కచ్చితంగా ఇది కరెక్ట్ అంటూ ఇంకో నెటిజన్ కామెంట్ చేయడం జరిగింది. ఇక మహారాష్ట్ర రాష్ట్రంలో రోజురోజుకీ కరోనా కేసులు బాగా పెరిగి పోతున్నాయి.

 

IHG

అయితే నేడు ఒక్కరోజే మహారాష్ట్రలో 274 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా, మొత్తం ఇప్పటి  వరకు 194 మంది మృత్యువాత పడ్డారు. ఇక మహారాష్ట్రంలో ఇప్పటి వరకు 2700 కి పైగా కేసులు నమోదయ్యాయి. ఏది ఏమైనా ప్రజలు లాక్ డౌన్ పాటించి పోలీసులకి, కరోనా వ్యాప్తి చెందకుండా సహకరించండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: