టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య ఈ సంవత్సరం చివర్లో జరగనున్న 4 టెస్టుల సిరీస్‌ ఈసారి మరింత రసవత్తరంగా, ఆసక్తికరంగా ఉండబోతోందని టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ తెలిపాడు. 2018-19 మధ్యలో ఆస్ట్రేలియా పర్యటనకి వెళ్లిన టీమిండియా జట్టు నాలుగు టెస్టుల సిరీస్ ‌ని 2-1 తేడాతో గెలవడంతో 7 దశాబ్దాల సిరీస్ గెలుపు నిరీక్షణకి తెరదించిన విషయం అందరికి తెలిసిందే. ఇక పోతే ఆ సిరీస్‌కి నిషేధం కారణంగా డేవిడ్ వార్నర్, స్టీవ్ ‌స్మిత్ లేకపోవడంతో కాస్త ఆస్ట్రేలియా టీమ్ బలహీనంగా ఉండటంతో భారత్ గెలిచిందని బాగా కామెంట్స్ వినిపించాయి.

 

ఇకపోతే ఈ సంవత్సరం జరగబోయే టెస్టు సిరీస్ గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ ‌స్మిత్ మళ్లీ జట్టులో ఉండడంతో, ఈసారి ఆస్ట్రేలియా కాస్త బలోపేతమైంది. ఈ కారణంతో ఈ సారి సిరీస్ భిన్నంగా, మజాగా ఉండబోతోంది. అయితే ఒక జట్టుగా మాత్రం టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందనడటంలో ఎటువంటి సందేహం లేదు. బౌలర్లు, బ్యాట్స్‌ మెన్‌లు ఇద్దరూ కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే ఇందులో నేను కూడా వ్యక్తిగతంగా ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని తెలిపాడు. కాకపోతే ఇప్పుడు ఈ సిరీస్ భలే మజాగా ఉండబోతోందని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

 

క్రితం సంవత్సరం 2019 వన్డే ప్రపంచకప్‌ లో ఏకంగా ఐదు శతకాలు బాదిన రోహిత్ శర్మ ఆ తర్వాత టెస్టుల్లోనూ ఓపెనర్ అవతారమెత్తి ఒక సెంచరీ, ఒక డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు రోహిత్. దీనితో ఇక 3 ఫార్మాట్లలోనూ రెగ్యులర్‌ ఓపెనర్ ‌గా మారిపోయాడు రోహిత్ శర్మ. ఇక జరగబోయే ఆస్ట్రేలియా సిరీస్ లోను అదే జోరుని కొనసాగించాలని ఆశిస్తున్నాడు రోహిత్. కాకపోతే, కరోనా వైరస్ కారణంగా ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన వాయిదా పడే సూచనలు నిండుగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి కరోనా శాంతిస్తుందో లేదో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: