టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని యొక్క భవితవ్యం, రిటైర్మెంట్ గురించి ఊహాగానాలుగా మాట్లాడేవారికి వారికి ఓపెనర్ రోహిత్ శర్మ కాస్త గట్టిగా ఆన్సర్ ఇచ్చాడు.  భారత్ వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ‌తో కలిసి ఇన్‌ స్టాగ్రామ్ లైవ్ ‌లో రోహిత్ శర్మ మాట్లాడగా.., మహి రిటైర్మెంట్ ‌పై చర్చ తెరపైకి వచ్చింది. అయితే ఈ విషయం దానిపై రోహిత్ శర్మ కాస్త సీరియస్ ‌గా మాట్లాడిన మహేంద్ర సింగ్ ధోనీ భవితవ్యం గురించి క్లారిటీ ఎవరికైతే క్లారిటీ కావాలనుకునే వారికి లాక్‌డౌన్ తర్వాత అతని ఇంటికి నేరుగా వెళ్లాలని అతడు సూచించాడు.

 


నిజానికి మహి గురించి అసలు ఏం జరుగుతోందో మాకు అర్ధం అవ్వడం లేదు. 2019 సంవత్సరం వన్డే ప్రపంచకప్‌ తర్వాత అతని గురించి ఎలాంటి అధికారిక వార్త మేము వినలేదు. కావున మహి కెరీర్ గురించి నేను ఇప్పుడేమీ చెప్పను అని అన్నాడు. అయితే నిజానికి భారత్ జట్టుకి దూరమైన తర్వాత ధోని అండర్‌ గ్రౌండ్ ‌లోకి వెళ్లిపోయాడు. కాబట్టి మహి గురించి ఎవరైతే తెలుసుకోవాలి అనుకునేవారు అందరూ లాక్ ‌డౌన్ తర్వాత డైరెక్ట్ ‌గా రాంచీలో ధోని ఉన్న చోటుకి కార్, బైక్ లేదా ప్లైట్‌ లో వెళ్లి.. అసలు నువ్వు ఏమి చేస్తున్నావ్..? అసలు నువ్వు మళ్లీ క్రికెట్ ఆడతావా లేదా..? అని డైరెక్ట్ గా ధోనీనే అడగండి’’ అని రోహిత్ శర్మ కాస్త ఘాటుగా స్పందించాడు.

 

 
అయితే 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత పూర్తిగా టీమిండియాకి దూరమైన ధోనీ.. ఆ తర్వాత ఐపీఎల్ - 2020 సీజన్ ‌లో తన ప్రతాపం చూపించడం ద్వారా మళ్లీ  టీమిండియా లోకి రీఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడు. కాకపోతే కరోనా వైరస్ కారణంతో ఐపీఎల్ - 2020 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో ప్రస్తుతం ధోనీ కెరీర్ కాస్త ప్రశ్నార్థకంలో పడిపోయింది. ఈ పరిస్థితిని చూసి కొంత మంది మాజీ క్రికెటర్లు ధోనీ తన ఇంటెర్నేన్షనల్ కెరీర్ పూర్తిగా ముగిసిపోయిందని కూడా కొందరు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: