సురేష్ రైనా... టీమిండియాకు అన్నిరకాలుగా సేవలందించిన ఆల్ రౌండర్. ఎడమచేతి బ్యాట్స్ మెన్ గా కుడి చేతి పార్ట్ టైం స్పిన్నర్ గా కళ్ళు చెదిరే ఫీల్డింగ్ తో టీమిండియాకు అనేక మ్యాచ్ లో తనవంతు సహాయాన్ని సురేష్ రైనా అందించాడు. ఇక కేవలం టీమిండియాకు కాకుండా ఐపీఎల్లో ను సురేష్ రైనా మొన్నటివరకు అత్యుత్తమ పరుగులు చేసిన క్రికెటర్ గా తాను ఉన్నాడు.

IHG


ఇక అసలు విషయానికి వస్తే... సురేష్ రైనా యువ కీపర్ కం బ్యాట్స్ మన్ రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. నిజానికి రిషబ్ పంత్ అద్భుతమైన ఆటగాడు అని అతడి ఆట చూస్తుంటే అచ్చం సెహ్వాగ్​, యువరాజ్​ మళ్లీ గుర్తు చేస్తుందని చెప్పుకొచ్చాడు. ఇటీవల ఇంస్టాగ్రామ్ లైవ్ లో టీమిండియా స్పిన్నర్ చాహల్ తో సురేష్ రైనా ముచ్చటించడం జరిగింది. ఇక సురేష్ రైనా చెబుతూ బాగా ఆడుతున్న సమయంలో రిషబ్ పంత్ టాప్ క్లాస్ ప్లేయర్ అని తెలిపాడు.


అతని ఆట వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లను మైమరచేలా చేస్తుందని సురేష్ రైనా తెలుపక వచ్చాడు. వారు ఎంత దూకుడుతో ఆడుతాడో, అలాగే రిషబ్ పంత్ ఫ్లిక్ షాట్ ఆడినప్పుడు ద్రావిడ్ గుర్తుకొస్తాడు అని తెలిపాడు. కాకపోతే ప్రస్తుతం టీమిండియా కె.ఎల్.రాహుల్ వికెట్ కీపింగ్ బాధితులు అందుకున్న తర్వాత టీమిండియా జట్టులో చోటు కరువైందని చెప్తున్నాడు. ఇంకోవైపు మిడిలార్డర్ లో మనీష్ పాండే కూడా బాగా అందుతుండడంతో ప్రస్తుతం స్థానం ప్రశ్నార్థకంగా మారుతోంది. అయితే ఇటీవల రిషబ్ పంత్ ని రోహిత్ శర్మ కూడా తన ఆట గురించి తెలపడం జరిగింది. అప్పుడు రోహిత్ శర్మ రిషబ్ పంత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: