నిన్నటి రోజున పుట్టినరోజు జరుపుకున్న టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, జట్టు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏప్రిల్ 30వ తారీఖున రోహిత్ 33 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తన పుట్టిన రోజును విభిన్న భావోద్వేగాలను మధ్య జరిగిందని శుక్రవారంనాడు రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.

 

IHG

అయితే ఇక ట్విట్టర్లో బాలీవుడ్ దిగ్గజం రిషి కపూర్ గురువారం మృతి చెందగా, విలక్షణ నటుడు అయిన ఇర్ఫాన్ ఖాన్  మృతి చెందిన విషయాలు తను ఎంతో భావోద్వేగానికి అని చెప్పుకొచ్చాడు. వీరి మృతిపై రోహిత్ శర్మ విచారాన్ని వ్యక్త పరిచాడు. అంతేకాకుండా ఆ ట్వీట్ లో మనం అందరం మళ్ళీ కరోనా వైరస్ నుండి బయటపడి మళ్ళీ అందరం సాధారణ జీవితాలను గడపాలని ఆయన ఆకాంక్షించారు.


ఇక అలాగే పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ కృతజ్ఞతలు అని, మనం ఇద్దరు దిగ్గజాలను మనం కోల్పోయాం అంటూ, అలాగే విభిన్న భావోద్వేగాల మధ్య రోజు సాగిందని మళ్లీ మన జీవితాలు సాధారణ స్థితికి చేరుకోవాలని మనకు ఎంతో ఇష్టమైన వారితో అందరం సంతోషంగా జీవించాలని నేను కోరుకుంటున్నానని రోహిత్ ట్వీట్ ద్వారా తన సందేశాన్ని తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: