ఈరోజు తెల్లవారుజామున వైజాగ్ లో జరిగిన గ్యాస్ లీకేజీ  ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎల్ జి పాలిమర్స్ అనే పరిశ్రమ నుండి స్టెరిన్ అనే విష వాయువు బయటికి విడుదలకావడంతో ఆ పరిశ్రమ చుట్టు పక్కల వున్నా గ్రామాలు ఎఫెక్ట్  అయ్యాయి.  సుమారు 2000 మందికి పైగా లీక్ అయిన గ్యాస్ ను పీల్చుకోవడం తో ఆసుపత్రి పాలయ్యారు. అందులో ఇప్పటివరకు 9మంది చనిపోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు  తెలుస్తుంది. జిల్లా యంత్రాగం  సకాలంలో స్పందించడం తో భారీ ప్రమాదం తప్పింది. 
 
ఇక ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. దాంతో  వివిధ రంగాల కు చెందిన ప్రముఖులు మరణించినవారికి సంతాపం తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. కాగా భారత క్రికెటర్లు కూడా ట్విట్టర్ ద్వారా ఈ ఘటన పై స్పందించారు. అందులో భాగంగా కోహ్లీ , రహానే , హార్దిక్ పాండ్య , హర్భజన్ సింగ్ లు విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: