2019 సంవత్సరంలో జరిగిన వరల్డ్ కప్ తర్వాత ఇంతవరకు మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ లో ఆడ లేదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అప్పటినుంచి ఇప్పటిదాకా అంటే ఏకంగా పది నెలలు గడిచిపోయాయి. ఇక కరోనా వైరస్ దెబ్బతో క్రికెట్ సహా అన్ని కార్యకలాపాలు వాయిదా పడడంతో టీమిండియా ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ తన కూతురు జీవాతో ఆడుతున్న వీడియోను సోషల్ మీడియాలో ధోని పోస్ట్ చేశారు. అయితే అందులో ధోని ఒక కొత్త లుక్ లో అందరినీ ఆశ్చర్య పరిచాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.


ఇకపోతే అభిమానులు అంతా లైకులు, కామెంట్లతో ఆ ఫోటోకు తెగ స్పందనను వ్యక్తం పరిచారు. ధోని షేర్ చేసిన ఆ వీడియోలో జీవ పెంపుడు జంతువులతో ఆడుకుంటుంది. అయితే ఈ వీడియోలో మహేంద్రుడు ఒకసారి కనిపించాడు. అందులో తెల్లని పొడవాటి గడ్డంతో ధోని కొత్త లుక్ బయటకు వచ్చింది. ఇదివరకు ఒకసారి కూడా ఇలా కనిపించాడు. మూడు సంవత్సరాల క్రితం విజయ్ హజారే టోర్నమెంట్ సందర్భంగా జార్ఖండ్ తరఫున బరిలోకి దిగినప్పుడు ఇలాంటి లుక్ తోనే కనిపించాడు.

 


అయితే టీమిండియాలో కలిసి ఆడుతున్నప్పుడు కూడా కొన్నిసార్లు ధోని తెల్లని గడ్డంతో మనకు కనిపించే వాడు. అయితే ఇంకో వైపు కొద్ది రోజులుగా ధోని రీ-ఎంట్రీ, లేదా రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలు వస్తున్నప్పటికీ ధోని మాత్రం వాటికి ఎటువంటి స్పందన ఇవ్వలేదు. ఇకపోతే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో తన సత్తా చాటి తిరిగి టీమిండియాలోకి వెళ్లాలి అనుకున్న ధోని ఐపీఎల్ సీజన్ వాయిదా పడటంతో అతని ఆశలు గల్లంతయ్యాయి. ఇక ముందు చూడాలి ధోనీ టీమిండియాకు ఆడుతాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: