కరోనా వైరస్ దెబ్బతో ప్రపంచంలోని అన్ని క్రీడా కార్యకలాపాలు వాయిదా పడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. దీనితో ప్రపంచం నలుమూలల తిరిగి అన్ని క్రీడా వర్గాలకు చెందిన టోర్నమెంట్లు పూర్తిగా రద్దయ్యాయి. అయితే ఇప్పుడిప్పుడే కొన్ని దేశాల్లో తిరిగి క్రీడా రంగాన్ని మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే అది కూడా ప్రేక్షకులు లేకుండా మాత్రమే. అయితే ఇక లాక్ డౌన్ కారణంగా ఆటగాళ్ళందరూ ఎవరింటికి వారే పరిమితమవడంతో వారి సమయాన్ని పూర్తిగా వారి కుటుంబాలతో సంతోషంగా గడుపుతున్నారు.
View this post on InstagramPeace & tranquility like a sense of belonging within your heart ❤️ @aesha.dhawan5
అంతే కాకుండా వారికి విరామం దొరికినప్పుడల్లా చాలా మంది క్రికెటర్లు సోషల్ మీడియాలో వారి అభిమానులతో మాటామంతి జరుపుతున్నారు. ఇంకా కొందరు క్రికెటర్లు టిక్ టాక్ వీడియోలతో కూడా వారి అభిమానులని ఫుల్లుగా కుష్ చేస్తున్నారు. ఇకపోతే టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తనలోని మరో కొత్త కోణాన్ని బయటికి తీసుకువచ్చాడు. ఆయన ఫ్లూట్ ఊదుతున్న ఒక వీడియోను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ గా మారింది.
నిజానికి ఆ వీడియో చుసిన అభిమానులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు కూడా. ఆ వీడియోకు కొన్ని వేల లైకులు కామెంట్లతో తమ స్పందనను తెలియజేస్తున్నారు కూడా. అంతేకాకుండా శిఖర్ ధావన్ తన కుటుంబ సభ్యులతో ఉన్న ఒక వీడియోను కూడా షేర్ చేయడం జరిగింది. అయితే ఇక ధావన్ ప్రస్తుతం కెరీర్ పరంగా గాడి తప్పాడు అని భావించవచ్చు. దీనికి కారణం గత సంవత్సరం నుంచి కాస్త గాయాలతో పాటు ఫామ్ లేకపోవడంతో తను టీమిండియా 11 మంది జట్టు సభ్యులలో తరచూ చోటు కోల్పోతున్నాడు. అయితే తను చివరిసారిగా జనవరి నెలలో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక ఇప్పటి వరకు ఈ గబ్బర్ సింగ్ 34 టెస్టులు, 61 టి20 లు, 136 వన్డేలు టీమ్ ఇండియా తరఫున ఆడాడు.