ప్రపంచం మొత్తం కరోనా దెబ్బకు అన్ని రంగాలు బాగా దెబ్బతిన్నాయి అని చెప్పవచ్చు. అందులో క్రీడా రంగంపై కూడా బాగా దెబ్బ పడింది. కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి ప్రపంచంలోని అన్ని క్రీడలకు సంబంధించిన కార్యకలాపాలు పూర్తిగా ఆపివేయడం జరిగింది. దీనితో అన్ని టోర్నమెంట్లు పూర్తిగా రద్దు అవ్వడం జరిగింది. ఇక దీనితో ఆటగాళ్లందరూ వారి సొంత ఇంటికి పరిమితం అయ్యారు.


ఇకపోతే అసలు విషయానికి వస్తే.... ఈ క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన భార్య బాలీవుడ్ నటి అనుష్క శర్మతో సరదాగా, ఆనందంగా సమయాన్ని గడుపుతున్నారు. వీరిద్దరూ కలిసి అప్పుడప్పుడు వారిద్దరి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఇంతకుముందు మీరిద్దరూ కలిసి కరోనా సమయంలో వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంతేకాకుండా లాక్ డౌన్ సమయంలో వారు పాటించవలసిన నిబంధనల గురించి కూడా ప్రజల్లో వారు స్ఫూర్తి నింపేందుకు ఒక వీడియో ని కూడా షేర్ చేశారు. 


ఇకపోతే తాజాగా వీరిద్దరి వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో కెప్టెన్ గా కోహ్లీ తన భార్య అనుష్క శర్మ వారి ఇంటి ఆవరణలో క్రికెట్ ఆడుతున్నారు. అందులో మొదటగా అనుష్క బ్యాటింగ్ చేయగా కోహ్లి బౌలింగ్ చేశారు. ఆ తర్వాత కోహ్లీ తన చేతి గ్లోవ్స్ ధరించి అనుష్క బౌలింగ్ చేయగా అతను బ్యాటింగ్ చేశాడు. అయితే అనుష్క కోహ్లీకి బౌన్సర్ వేయగా కెప్టెన్ కోహ్లీ దాన్ని డిఫెన్స్ చేశాడు. అయితే ఈ విషయంలో కోహ్లీ అభిమానులు చాలా రోజుల తర్వాత కోహ్లీ బ్యాటింగ్ చూస్తున్నాము అంటూ కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాలని తెలిపారు. ఇక వీరిద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా... !

మరింత సమాచారం తెలుసుకోండి: