భారతదేశంలో బాగా పేరు పొందిన జంటలలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ జోడి అని చెప్పవచ్చు. వీరిద్దరూ ప్రేమించుకుని ఆ తర్వాత కొన్నాళ్లు డేటింగ్ చేసి సంవత్సరం క్రితం వారిద్దరి వివాహం చేసుకున్నారు. దీనితో వారి ఇద్దరి బంధం మరింత బలపడింది. ఇక లాక్ డౌన్ కారణంగా ఆడు క్రికెట్ మ్యాచ్ లు లేకుండా విరాట్ కోహ్లీ, సినిమా షూటింగ్ లేకుండా అనుష్క శర్మ ఇద్దరు ఇంట్లో ఉంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.


ఇక మధ్య మధ్యలో వీరిద్దరూ కొన్ని ఫన్నీ ఫన్నీ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. వీటితో వారి అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. అయితే తాజాగా విరాట్ కోహ్లీ ఇండియా ఫుట్ బాల్ కెప్టెన్ సునీల్ ఛేట్రీ తో విరాట్ దంపతులు లైవ్ చాటింగ్ లో పాల్గొన్నారు. అయితే ఇందులో సునీల్, కోహ్లీ దంపతులను కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఒకవేళ విరాట్ కోహ్లీ - అనుష్క శర్మల పై బయోపిక్ చేయవలసి వస్తే అందులో కోహ్లీ నువ్వు నటిస్తావా అని అడిగాడు. ఇక వెంటనే దానికి కోహ్లీ - అనుష్క అంటే నేను కచ్చితంగా నటిస్తాను, నాకు నటన వచ్చు అన్నది అవాస్తవం అని తెలిపాడు.


అంతేకాకుండా నా పాత్రలో నాకంటే ఇంకెవరు నటించలేరని నా యొక్క ఆలోచన. ఒకవేళ అలా గనుక ఎవరైనా చేస్తే నేను పనికి రాని వాడిని అవుతానని అతనికి సమాధానం ఇచ్చాడు. ఇకపోతే టీవీ యాడ్స్ కోసం నటించడం ద్వారానే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారి ప్రస్తుతం పెళ్లి చేసుకుని హాయిగా జీవిస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా వీరిద్దరూ కలిసి కొన్ని యాడ్స్ లో నటిస్తున్నారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: