టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం టీమిండియా ఖ్యాతిని ఎంతగానో పెంచి జట్టులో కీలక ఆటగాడిగా ఎదగడమే కాదు ప్రపంచం మేటి బ్యాట్ మెన్ లలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ . విరాట్ కోహ్లీ ఒకసారి మైదానంలోకి దిగి బ్యాట్ జులిపించాడు అంటే పరుగుల వరద పారాల్సిందే . అందుకే విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయడానికి బౌలర్ల వెన్నులో వణుకు పుడుతుంది. అటు సోషల్ మీడియాలో కూడా విరాట్ కోహ్లీ ఎప్పుడు పలు విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లాక్ డౌన్ సమయంలో విరాట్ కోహ్లీ ఎక్కువగా సోషల్ మీడియా వేదిక అభిమానులతో ముచ్చటిస్తున్నారు.
అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా టీమిండియా డేర్ అండ్ డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ప్రపంచ దిగ్గజ ఆటగాళ్లలో ఒక్కడైనా కెవిన్ పీటర్సన్ ను ట్రోల్ చేశాడు. ఇంస్టాగ్రామ్ వేదికగా త్రూ బ్యాక్ అంటూ ఒక ఫోటో పోస్ట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ గడ్డం తో ఉన్నారు.. అయితే కెవిన్ పీటర్సన్ విరాట్ కోహ్లీ ట్రోల్ చేయాలనే ఉద్దేశంతో... విరాట్ ముందు ఆ గడ్డం తీసేయ్ అంటూ కామెంట్ చేశాడు. ఇక దీనికి ఘాటుగానే బదులిచ్చాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. కెవిన్ పీటర్సన్ టిక్ టాక్ వీడియో ని జత చూస్తూ నీ టిక్ టాక్ వీడియోలు అంటే నా గడ్డం ఎంతో బాగుంది అంటూ కామెంట్ చేసి షాకిచ్చాడు.
అయితే గత కొన్ని రోజులుగా కెవిన్ పీటర్సన్ సోషల్ మీడియా వేదికగా టిక్ టాక్ లో పలు వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టిక్ టాక్ లో కెవిన్ పీటర్సన్ వీడియో లకు సంబంధించి ప్రస్తుతం విరాట్ కోహ్లీ చేసిన ట్రోల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. దీనిపై నెటిజన్లు కూడా బిన్నంగా స్పందిస్తున్నారు. విరాట్ కోహ్లీ పై కామెంట్ చేస్తే ఇలాగే షాకింగ్ రిప్లై వస్తుంది అంటూ కొంతమంది అంటుంటే. కొంతమంది విరాట్ కోహ్లీ కామెంట్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం విరాట్ కోహ్లీ కెవిన్ పీటర్సన్ పై చేసిన ట్రోల్ మాత్రం వైరల్ అయిపోయింది.