బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నిన్న తన నివాసం లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈవార్తతో ఒక్కసారిగా బాలీవుడ్ దిగ్బ్రాంతికి లోనైంది అయితే కేవలం సినీ ప్రముఖలే కాదు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సహా సుశాంత్  మరణంపై స్పందించారు. ఇక టీమిండియా క్రికెటర్లు అయితే దాదాపు అందరూ ఈ వార్త నిజం కాదంటూ  సంతాపం తెలియజేశారు కానీమాజీ సారథి ధోని నుండి మాత్రం ఇప్పటివరకు రెస్పాన్స్ లేదు. నిజానికి మిగితా క్రికెటర్ల కంటే ధోని తోనే సుశాంత్ కు సాన్నిహిత్యం ఎక్కువ. ఎందుకంటే ధోని బయోపిక్ ఎంఎస్ ధోని లో హీరోగా సుశాంతే నటించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ధోని, సుశాంత్ బాగా క్లోజ్ అయ్యారు. 
 
ఇక ధోని పాత్రలో సుశాంత్ ను తప్ప మరేవరిని వూహించుకోలేం అనేఅంతలా స్క్రీన్ పై ధోనిని దింపేశాడు సుశాంత్. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది అయితే సుశాంత్ మరణవార్త విన్నా కూడా ధోని సైలెంట్ గా ఉండడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక సుశాంత్ మరణం పై టీమిండియా కెప్టెన్ కోహ్లీ తో సహా రోహిత్ , రైనా ,ధావన్, మయాంక్ అగర్వాల్ , రాహుల్ , అశ్విన్ , రహానే ఇలా అందరూ సంతాపం వ్యక్తం జేస్తూ ట్వీట్ లు చేశారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: