ఇంగ్లాండ్ టూరు నేపథ్యంలో ఇటీవల పాకిస్థాన్ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో  10మంది ఆటగాళ్లకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది అయితే మరో రెండు రోజుల తరువాత మళ్ళీ టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లలో రియాజ్ , మహమ్మద్ హఫీజ్, రిజ్వాన్ ,హస్నైన్ ,ఫకర్ జమాన్ ,షాదాబ్ ఖాన్ లకు నెగిటివ్ వచ్చింది దాంతో మూడు రోజుల వ్యవధిలో మరోసారి ఈ 6గురికి టెస్టులు నిర్వహించగా మళ్లీ అందరికి నెగిటివ్ రావడం తో వారు కూడా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్ళడానికి ఆమోదం లభించింది.
 
ఇక ఈనెల 3న వీరందరూ ఇంగ్లాండ్ బయలుదేరి వెళ్లనున్నారని పీసీబీ ప్రకటించింది. ఇప్పటికే ఈపర్యటన కోసం 20మంది పాక్ ఆటగాళ్లు రెండు రోజుల క్రితమే మాంచెస్టర్ చేరుకొని ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టారు తాజాగా నెగిటివ్ వచ్చిన ఈఆరుగురు క్రికెటర్లు కూడా వారితో కలవనున్నారు. ఈపర్యటనలో ఆతిథ్య జట్టు తో పాక్ మూడు టెస్టులు ,మూడు టీ 20ల్లో తలపడనుంది. 
 
పాకిస్థాన్ జట్టు : 
అబిద్ అలీ ,ఇమామ్ ఉల్ హాక్ , షాన్ మసూద్ , అజార్ అలీ (టెస్టు కెప్టెన్), బాబర్  అజామ్( టీ 20 కెప్టెన్), అసద్ షఫీక్ , ఫవాద్ ఆలమ్ ,ఇఫ్తికర్ అహ్మద్,కుష్ దిల్ షా ,సర్ఫరాజ్ (కీపర్), ఫహీమ్ అష్రాఫ్ , అబ్బాస్ , నసీం షా , షహీన్ షా ఆఫ్రిది ,సోహైల్ ఖాన్ , ఉస్మాన్ షాన్వారి , ఇమాద్ వసీం , యాసిర్ షా ,ముసా ఖాన్ ,  రోహాలి నజీర్, రియాజ్ , హఫీజ్, రిజ్వాన్ , హస్ నైన్ , ఫకర్ జమాన్ ,షాదాబ్ ఖాన్ 

మరింత సమాచారం తెలుసుకోండి: