ఇంగ్లాండ్ టూరుకు వెళ్లే ముందు పాకిస్థాన్ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయగా అందులో 10మందికి పాజిటివ్  అని తేలింది. నెగిటివ్ వచ్చిన ఆటగాళ్లు గత నెల 29నే ఇంగ్లాండ్ కు వెళ్లారు. అయితే కొద్దీ రోజుల తరువాత పాజిటివ్ వచ్చిన 10మందికి మళ్ళీ పరీక్షలు చేయగా అందులో ఆరుగురు ఆటగాళ్లు.. హఫీజ్ ,ఫకర్ జమాన్ , వాహబ్ రియాజ్ ,రిజ్వాన్ ,షాదాబ్ ఖాన్,హస్నైన్ లకు నెగిటివ్ వచ్చింది దాంతో ఈనెల3న వీరు కూడా ఇంగ్లాండ్ కు వెళ్లారు. 
 
ఇక పాజిటివ్ వచ్చిన మిగిలిన నలుగురు ఆటగాళ్లు..హైదర్ అలీ, ఇమ్రాన్ ఖాన్ ,హరీష్ రవూఫ్ , కషిఫ్ బట్టి లకు తాజాగా మళ్ళీ పరీక్షలు నిర్వహించగా ఇందులో హారిస్ రవూఫ్ తప్ప మిగితా ముగ్గురికి  నెగిటివ్ వచ్చింది దాంతో వీరు కూడా ఈనెల8న ఇంగ్లాండ్ వెళ్లనున్నారు అయితే మరోసారి పాజిటివ్ వచ్చిన హారిస్ రవూఫ్ కు మాత్రం కరోనా లక్షణాలు లేకపోవడం గమనార్హం. ఈపర్యటనలో పాక్ ఆతిథ్య జట్టుతో ,మూడు టెస్టులు ,మూడు టీ 20ల్లో తలపడనుంది. 
 
పాకిస్థాన్ జట్టు:
అబిద్ అలీ ,ఫకర్ జమాన్, ఇమామ్ ఉల్ హాక్ , షాన్ మసూద్ ,అజార్ అలీ (టెస్టు కెప్టెన్), బాబర్  అజామ్( టీ 20 కెప్టెన్), అసద్ షఫీక్ , ఫవాద్ ఆలమ్ ,హైదర్ అలీ,ఇఫ్తికర్ అహ్మద్,కుష్ దిల్ షా ,హఫీజ్ , రిజ్వాన్ (కీపర్), సర్ఫరాజ్ (కీపర్), ఫహీమ్ అష్రాఫ్ , ఇమ్రాన్ ఖాన్, అబ్బాస్ , హస్నైన్ , నసీం షా , షహీన్ షా ఆఫ్రిది ,సోహైల్ ఖాన్ , ఉస్మాన్ షాన్వారి , వాహబ్ రియాజ్ , ఇమాద్ వసీం , కషిఫ్ బట్టి , షాదాబ్ ఖాన్, యాసిర్ షా, ముసా ఖాన్, రోహాలి నజీర్  

మరింత సమాచారం తెలుసుకోండి: