కరోనా కారణంగా మిగితా దేశాలు క్రికెట్ మ్యాచ్ ల నిర్వహణకు నో చెప్తుంటే ఇంగ్లాండ్ మాత్రం దైర్యంగా ముందడుగేసింది. రేపటి నుండి సౌతాంఫ్టన్ వేదికగా జరుగనున్న మొదటి టెస్టుతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ తిరిగి ప్రారంభం కానుంది. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి టెస్టులో ఇంగ్లాండ్ తో రేపటినుండి వెస్టిండీస్ తలపడనుంది. బయో సెక్యూర్ వాతావరణంలో కొత్త రూల్స్ నడుమ ప్రేక్షకులు ఎవరులేకుండా జరుగనున్న ఈమ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
ఇక ఈసిరీస్ ముగిశాక ఐర్లాండ్ మరియు పాకిస్థాన్ తో సిరీస్ లను లైన్లో పెట్టింది ఇంగ్లాండ్. ఇప్పటికే ఈ పర్యటన కోసం పాక్ ,ఇంగ్లాండ్ కు చేరుకుంది. ఇక ఈసిరీస్ ల షెడ్యూల్ కూడా ప్రకటించింది ఈసీబీ. ఇందులో మొదటగా ఐర్లాండ్ తో మూడు వన్డేల్లో ఆడనుంది ఇంగ్లాండ్. 
 
ఐర్లాండ్ -ఇంగ్లాండ్ వన్డే సిరీస్ (డే/నైట్) :
మొదటి వన్డే - జూలై 30 (సౌతాంఫ్టన్)
రెండో వన్డే - ఆగస్టు 2  (సౌతాంఫ్టన్)
మూడో వన్డే - ఆగస్టు 4  (సౌతాంఫ్టన్)
 
పాకిస్థాన్ -ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ :
మొదటి టెస్టు - ఆగస్టు  5-9 (మాంచెస్టర్)         
రెండవ టెస్టు -ఆగస్టు 13-17 (సౌతాంఫ్టన్)
మూడవ టెస్టు -21-25 (సౌతాంఫ్టన్)
 
పాకిస్థాన్ -ఇంగ్లాండ్ టీ 20 సిరీస్ :
మొదటి టీ 20 - ఆగస్టు 28  (మాంచెస్టర్ )  
రెండో టీ 20 -ఆగస్టు 30 ( (మాంచెస్టర్ ) 
మూడో టీ 20- సెప్టెంబర్  (మాంచెస్టర్ ) 

మరింత సమాచారం తెలుసుకోండి: