టీంఇండియా మాజీ సారథి ,వికెట్ కీపర్ ధోని నిన్న తన 39వ పుట్టిన రోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు భారత క్రికెటర్లు ధోనికి శుభాకాంక్షలు తెలిపారు అయితే యువ క్రికెటర్లు హార్దిక్ పాండ్య ,కృనాల్ పాండ్య మాత్రం రాంచిలోని ధోని వున్న ఫామ్ హౌజ్ కు వెళ్లి అతనికి విషెస్ తెలియజేసి బర్త్ డే ను సెలబ్రేట్ చేశారు. పాండ్య బ్రదర్స్ రాంచికి వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి.
ఇదిలావుంటే గత ఏడాది వన్డే ప్రపంచ కప్ తరువాత క్రికెట్ కు దూరంగా వున్నాడు ధోని అయితే అదే సమయంలో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వచ్చాయి కానీ ధోని మాత్రం ఆవిషయం గురించి పట్టించుకోలేదు  ఐపీఎల్ ద్వారా రీ ఎంట్రీ కంఫర్మ్ అనుకున్నారు కానీ కరోనా, ధోని అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది.  నిజానికి మార్చి 29 నుండి ఐపీఎల్ 13 ప్రారంభం కావాల్సింది దాంతో అదే నెలలో ప్రాక్టీస్ కోసం ధోని ,చెన్నై వచ్చాడు కానీ  అప్పుడే కరోనా కూడా ఎంట్రీ ఇవ్వడంతో ప్రాక్టీస్ కు ప్యాకప్ చెప్పి ధోని,రాంచికి వెళ్ళిపోయాడు.
 
ప్రస్తుతం ధోని, రాంచిలో సేంద్రియ పద్దతిలో వ్యవసాయం చేస్తున్నాడు. ప్రస్తుతానికి అతను ఎంటువంటి కమర్షియల్ యాడ్ లో నటించడం లేదు అయితే ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయినా వచ్చి ఆడడానికి ధోని రెడీగా వున్నాడని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: