సెలబ్రిటీలు, క్రికెటర్లకు ఫ్యామిలీతో గడిపే సమయం చాలా తక్కువ. చాలా మంది ఆటగాళ్లు తమ బిజీ షెడ్యూల్స్ కారణంగా తమ పిల్లలతో అల్లరి చేయడం, వారితో గడపడం, వాళ్లు మాట్లాడే ముద్దు ముద్దు మాటలను మిస్ అవుతూ ఉంటారు. లాక్ డౌన్ కారణంగా ఆ సరదా తీరిపోయింది అందరికి. టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఈ కరోనా వ్యాప్తి కారణంగా ఫ్యామిలీతో సమయం గడిపే అవకాశం దక్కింది. 

 


ఈ క్రమంలో క్రికెటర్ రోహిత్ తన కూతురు సమైరాతో సరదాగా గడిపిన క్షణాలు, సరదాగా ఆడుకుంటున్న ఆటలు, వీడియోలు, ఫోటలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా తన ఇన్ స్టాగ్రామ్  అకౌంట్లో కూతురుతో దిగిన ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు సంబర పడుతున్నారు.  సన్ గ్లాసెస్ ధరించుకుని సమైరా.. నవ్వుతూ హిట్ మ్యాన్ వైపు చూస్తున్న ఫోటోను అభిమానులకు షేర్ చేస్తూ ‘‘ దాదా కంటే బెటర్ గా సన్ గ్లాసెస్ ని ధరించింది ’’ అని క్యాప్షన్ రాసి పోస్ట్ చేశారు. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

She wears it better than dada 😎

A post shared by rohit Sharma (@rohitsharma45) on

 


కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే దిశగా లాక్ డౌన్ విధించడంతో దాదాపు 4 నెలల నుంచి ఇంటికే పరిమితమయ్యారు రోహిత్ శర్మ. ఇటీవల ముంబాయిలోని ఓ పార్కులో కాసేపు ప్రాక్టీస్ చేశాడు కానీ, దేశంలోనే అత్యధిక కేసులు ముంబయిలో నమోదవుతుండటంతో ప్రాక్టీస్ ను నిలిపివేసిన రోహిత్ ఇంటికే పరిమితమయ్యారు.

 

 

ఖాళీ సమయాల్లో కూతురితో ఆడుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఐపీఎల్ 2020 సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసిన తర్వాత రోహిత శర్మ తన ఫిట్ నెస్, ప్రాక్టీస్ మొదలుపెట్టే సూచనలున్నాయి. ఎదేమైనా లాక్ డౌన్ లో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటూ.. కూతురితో గడిపిన మధుర క్షణాలను పంచుకుంటున్నారు క్రికెటర్ రోహత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: