మొన్నటి వరకు ప్రపంచం అంతా ఐపీఎల్ క్రికెట్ ఎంజాయ్ మెంట్ లో ఉన్న విషయం తెలిసిందే.  ఇప్పుడు చిన్నా పెద్ద ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వస్తుంది.  ఇంగ్లాండ్ వేదికగా జరిగే ఐసీసీ ప్రపంచకప్ జరగబోతుంది.  ఈ నేపషథ్యంలో ఐసీసీ ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కొన్నిరోజుల క్రితమే 15 మందితో జట్టును ఎంపిక చేసినా, ఇప్పుడా 15 మందితోనే ఎలాంటి మార్పులు లేని తుది జట్టును ప్రకటించారు. 

కేదార్ జాదవ్ ఫిట్ నెస్ సాధించకుంటే ఆ స్థానం అంబటి రాయుడుకి ఇవ్వాలని నిర్ణయించారు.  కానీ డిలార్డర్ బ్యాట్స్ మన్ కేదార్ జాదవ్ ఫిట్ నెస్ సాధించడంతో తన స్థానం నిలుపుకున్నాడు. జాదవ్ ఫిట్ నెస్ సాధించకపోతే అంబటి రాయుడుకు అవకాశం దక్కేదన్న అంచనాల నేపథ్యంలో బీసీసీఐ ఎలాంటి మార్పులు లేని తుది జట్టును ప్రకటించింది.


తాజాగా ఐసీసీ ప్రపంచకప్ లో పాల్గొనే భారత జట్టు వివరాలు : 
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విజయ్ శంకర్, మహేంద్ర సింగ్ ధోనీ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్ (సెకండ్ వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్.
 



మరింత సమాచారం తెలుసుకోండి: