గతంలో ఇలాంటి అనుభవాలు ధోని , కోహ్లీ కి చాలానే ఎదురైయ్యాయి. తమ అభిమాన క్రికెటర్లను కలుసుకోవాలని ఉత్సాహంతో వారు చేస్తున్న వల్ల ఇబ్బంది పడుతున్నారు. అయితే రోహిత్ కు మైదానం లోపల ఇలా జరగడం ఇదే మొదటిసారి. గత కొన్ని సంవత్సరాలుగా రోహిత్ విశేషంగా రాణిస్తూ అభిమానులను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత్ క్రికెట్ లో ధోని , కోహ్లీ తరువాత అత్యంత ఆదరణ కలిగిన క్రికెటర్ రోహిత్ శర్మనే.
ఇదిలాఉంటే ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా తో జరుగుతున్న రెండో టెస్ట్ లో టీం ఇండియా మ్యాచ్ ను శాసించే స్థితికి చేరుకుంది. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 601పరుగులు చేసి డిక్లెర్ చేయగా సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ లో 275 పరుగులకే కుప్పకూలి ఫాలో ఆన్ ప్రమాదంలో పడింది.