ఈమధ్య కాలంలో టీం ఇండియా స్వదేశంలో 32టెస్ట్ మ్యాచ్ లు ఆడగా అందులో 25మ్యాచ్ లను గెలిచి కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఓడిపోయింది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు స్వదేశంలో టెస్టుల్లో భారత జట్టు జైత్రయాత్ర ఎలా కొనసాగుతుందోనని. ఇదిలా ఉంటే తాజా సిరీస్ విజయంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ పట్టికలో 200 పాయింట్ల తో ఎవరి కి అందనంత దూరంలో వుంది భారత్. ఇటీవల వెస్టిండీస్తో జరిగిన టెస్ట్ సిరీస్ తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను ఆరంభించిన టీమిండియా..ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా లేకుండా అన్ని మ్యాచ్ లు గ గెలుపొంది పాయింట్ల పట్టికలో అగ్ర స్థానం లో కొనసాగుతుంది. రానున్న మ్యాచ్ ల్లో కూడా టీమిండియా ప్రదర్శన ఇలాగే కొనసాగితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ టైటిల్ ను సాధించడం మన జట్టుకు పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.