టీమిండియా యువ వికెట్ కీపర్
రిషబ్ పంత్... నిన్న రాంచి లోని ధోని ఇంటికి వెళ్ళి సరదాగా గడిపాడు. ఇద్దరు కలిసి కాసేపు ఇంటి ముందున్న గార్డెన్ లో కూర్చొని సరదాగా ముచ్చటించుకున్నారు. ఆ సమయంలో ధోని శునకం కూడా అక్కడే ఉండడం తో పంత్ దాంతో కాసేపు ఆడుకున్నాడు. ఇక వాటికీ సంబంధించిన పోటోలను పంత్ తన ఇంస్టా గ్రామ్ లో పోస్ట్ చేసి గుడ్ వైబ్స్ ఓన్లీ అనే క్యాప్షన్ జతచేశాడు. ఈ ఫోటోలు కాస్త వైరల్ కావడం తో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విజయవంతమైన ఆటగాడి దగ్గర సలహాలు తీసుకుంటున్న యువవికెట్ అని ,యువవికెట్ కీపర్ అని అలాగే శునకం తో ఏం చెబుతన్నావ్ పంత్ అని ఇలా తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
ఇక ధోని వారసుడు అంటూ ఒకేసారి అన్ని ఫార్మట్ లలోకి దూసుకువచ్చిన పంత్ .. వరుసగా విఫలమవుతూ ప్రస్తుతం కెరీర్ ను ప్రమాదం లో పడేసుకున్నాడు.
వరల్డ్ కప్ తరువాత
వెస్టిండీస్ పర్యటనలో విఫలమైన పంత్ ఆతరువాత
సౌతాఫ్రికా తో జరిగిన టీ 20 సిరీస్ లో కూడా అదే ఫామ్ నే కొనసాగించడం తో టెస్ట్ సిరీస్ కు బెంచ్ కే పరిమితం అయ్యాడు. తాజాగా బంగ్లాదేశ్ తో సిరీస్ కు కూడా ఎంపికైన పంత్ .. మరోసారి బెంచ్ కే పరిమితం కాకపోవచ్చు. పంత్ వున్నా కూడా టీ 20 సిరీస్ కు రెగ్యులర్ వికెట్ కీపర్ గా సంజూ శాంసన్ ను ఎంపిక చేసింది యాజమాన్యం. ఇక ఇటీవల
సౌతాఫ్రికా తో జరిగిన టెస్టు సిరీస్ లో తన కీపింగ్ స్కిల్స్ చూపెట్టి ప్రశంసలు అందుకున్న సాహ నే బంగ్లా తో టెస్ట్ సిరీస్ కు కొనసాగించనున్నారు.