భారత దేశంలో ప్రస్తుతం క్రికెట్ ఆటలో పరుగుల సునామీ సృష్టిస్తున్న ఆటగాడు ఎవరూ అంటు ఒకప్పుడు సచిన్ పేరు చెబితే..ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా విరాట్ కోహ్లీ పేరునే చెబుతారు. ఎందుకంటే బరిలో దిగాడంటే హాఫ్ సెంచరీ చేయకుండా అస్సలు ఊరుకోండు..ఇక అది దాటితే మాత్రం సెంచరీ ఖాయం. ఇలా ఎలాంటి దేశానికి చెందిన బౌలర్లనైనా ముప్పతిప్పలు పెడుతూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. అంతే కాదు మనోడు యాడ్స్ లో కూడా దుమ్మురేపుతున్నాడు. ఇక విరాట్ కోహ్లీ, అనుష్క ప్రేమాయణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..విడిపోతూ కలుస్తూ..వీరి ప్రేమ యావత్ భారత దేశం కథలు కథలుగా చెప్పుకుంటారు.

ఇక ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు అరుదుగా ఉంటారు..కవలలైతే అచ్చు ఒకరిని పోలిన వారు మరొకరు ఉంటారు. తాజాగా విరాట్ కోహ్లీని పోలిన యువకుడు ఒక వ్యక్తి ఉన్నాడంటే మీరు నమ్ముతారా.! కానీ నమ్మాల్సిందేనండి ఎందుకంటే ఆ వ్యక్తి కుడా ఉన్నది మన హైదరాబాద్ లోనే. హైదరాబాద్ కు చెందిన ప్రశాంత్ అనే యువకుడిని చూస్తే మీరు కచ్చితంగా కోహ్లి ని చూశామా అని అనుకోవాల్సిందే.

ఇకపోతే మనోడు విరాట్ కి వీరాభిమాని..ఇక అతగాడి పోలికలు ఉన్నాయని స్నేహితులంటుంటే మనోడి ఆనందానికి అవధులు ఉండవట. గతంలో ముంబైలో కూడా సచిన్ ని పోలిన వ్యక్తి ఒకరు కనిపించి హల్ చల్ చేశాడు. ఇప్పుడు విరాట్ ని పోలిన వ్యక్తి చూస్తుంటే అందరూ ఆశ్చర్య పోతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: