ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో నాలుగు మ్యాచ్ లకు గాను 1-0తో ముందంజలో ఉంది ఆసిస్ జట్టు. అయితే ఈ నెల 4 నుండి బెంగుళూరులో జరుగనున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారాత జట్టు నుండి గట్టి పోటీ ఉంటుందని ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ అన్నారు. 


మొదటి మ్యాచ్ మా జట్టు చూపిన ప్రతిభ మెచ్చుకోదగినదని.. అయితే భారత జట్టు ఏ క్షణమైనా మ్యాచ్ ను తమ వైపుకు తిప్పేస్తారని అందుకే ఏమాత్రం నిర్లక్షం వహించ కూడదని తమ జట్టు ఆటగాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. మొదటి టెస్ట్ లో 333 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించిన ఆసిస్ జట్టు అదే విజయ పరంపరను కొనసాగించాలని చూస్తుంది. ఓ పక్క ఓటమి భారంతో సత్తా చాటాలని చూస్తున్నారు టీం ఇండియా ఆటగాళ్లు. 



మరింత సమాచారం తెలుసుకోండి: