భారత్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో భాగంగా రాంచిలో మూడో టెస్ట్ జరుగనుంది. ఇప్పటికి జరిగిన రెండు టెస్టుల్లో 1-1తో ఈక్వల్ గా ఉన్న భారత్ ఆస్ట్రేలియాలు జరుగబోయే మూడో టెస్ట్ లో ఆమీ తూమీ తేల్చుకోనున్నారు. రాంచిలోని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మొదటిసారి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది.


రాంచి పిచ్ లో భారత ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. ఇక రెండు టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమైనా టీం ఇండియా సారధి విరాట్ కొహ్లి ఈసారి తన వికెట్ అంత ఈజీగా ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు. అందుకే బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ కోసం 5 నెంబర్ పిచ్ సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సాధారణంగా వన్డే, టి20 లకైతే 9 నెంబర్ పిచ్ సెలెక్ట్ చేస్తారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: