ఈ ఐపిఎల్ సీజన్ లో సన్ రైజర్స్ జోరు కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్ మొదటి మ్యాచ్ బెంగళూరుతో పోటీ పడి గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈరోజు గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా విజయ ఢంఖా మోగించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోగా హైదరాబాద్ బౌలర్ రషిద్ ఖాన్ బౌలింగ్ ప్రతిభతో గుజరాత్ బ్యాట్స్ మన్ ను ముప్పతిప్పలు పెట్టాడు. 4 ఓవరలో 19 పరుగులకు 3 వికెట్లు తీశాడు రషిద్ ఖాన్. ఇక నిర్ణీత ఓవర్లలో గుజరాత్ జట్టు 7 వికెట్ల తేడాతో 135 పరుగులు చేసింది.  


ఇక 136 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన హైదరాబాద్ జట్టు మ్యాచ్ ను 15.3 ఓవర్లలోనే ముగించేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 9 పరుగులకే అవుట్ అయినా కెప్టెన్ డేవిడ్ వార్నర్ 76 పరుగులతో విధ్వంసకర బ్యాటింగ్ తో జట్టుకి విజయాన్ని అందించాడు. వన్ డౌన్ దిగిన హెన్రిక్స్ కూడా 52 పరుగులు చేయడంతో సన్ రైజర్స్ విజయం సునాయాసమైంది. ఈ సీజన్ లో రెండు మ్యాచులు ఆడి రెండిటిని గెలిచింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదే దూకుడు మిగతా మ్యాచులల్లొ కూడా కొనసాగిస్తుందో లేదో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: