ప్రస్తుతం జరుగుతున్న ఆసియా అథ్లెటిక చాంపియన్ షిప్ లో భారత అథ్లెట్లు తొలి రొజు రెండు స్వర్ణ పతకాలను గెలుచుకోగా శుక్రవారం మరో నాలుగు స్వర్ణాలను గెలుచుకున్నారు. ఆసియా అథ్లెటిక్ చాంపియన్ షిప్ లో భారత అథ్లెట్ లు సత్తా చాటుతున్నారు. 400 మీ, 1500 మీ పరుగులో పురుషుల, మహిళల విభాగాల్లో బంగారు పతకాలు గెలుచుకున్నారు. 


400 మీ పరుగులో మహ్మద్‌ అనాస్‌, నిర్మల షరోన్‌ స్వర్ణాలు గెలుచుకోగా.. 1500 మీ పి.యు.చిత్ర, అజయ్‌కుమార్‌ సరోజ్‌ స్వర్ణాలు కొల్లగొట్టారు. ఇక ఈ నాలుగు పతకాలతో భారత్‌ 6 స్వర్ణ, 3 రజత, 6 కాంస్యాలను సాధించింది ఇక మొత్తం 15 పతకాలతో మొదటి స్థానంలో ఉంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: