గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురం గురించి తెలియని వారు ఉండరు.  ఆ ఊరు పేరు చెబితే ఎన్నో వివాదాల కేంద్ర బింధువుగా ఉంటుందన్న విషయం తెలిసిందే.  తాజాగా  గుంటూరు జిల్లా బాపట్ల మండలం స్టువర్టుపురం నుంచి ఓ ఆటగాడు తన ప్రతిభ నిరూపించి అందరితో షెభాష్ అనిపించుకున్నాడు.

కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ పోటీల్లో బాపట్ల మండలం స్టువర్టుపురానికి చెందిన రాగాల వరుణ్ 77 కిలోల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. స్నాచ్, క్లీన్ అండ్ జర్క్ లు కలిపి వరుణ్ 269 కిలోల బరువును ఎత్తాడు. ఈ స్వర్ణంతో వరుణ్ ఇదే విభాగంలో ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు డైరెక్టుగా అర్హతను సాధించాడు.

స్వర్ణ పతకం సాధించిన వరుణ్ ను పలువురు ప్రముఖులు అభినందించారు. దీక్షితను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఏ వెంకటేశ్వరరెడ్డి అభినందించారు.  ఇక తెలంగాణ, మహబూబాబాద్ జిలకలాకు చెందిన ఎర్ర దీక్షిత, 58 కిలోల జూనియర్ విభాగంలో 167 కిలోల బరువెత్తి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: