భారత్  ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబరు 17 నుంచి సీరిస్ జరగనుంది. ఇందులో భాగంగా  ఐదు వన్డేల మ్యాచ్ లు ఆడనున్నారు. ఈ నేపథ్యంలో మొదటి మూడు వన్డేలకు టీమిండియా జట్టును బీసీసీఐ వెల్లడించింది. శ్రీలంక టూర్ కి వెళ్లిన జట్టునే సెలక్టర్లు ఈ సీరిస్ కి కూడా ఎలాంటి మార్పు లేకుండా ప్రకటించేశారు. భారత్ తరపున ఆడుతున్న ఆటగాళ్ల వివరాలు మీరూ చూడొచ్చు.


విరాట్ కోహ్లీ (కెప్ట్ న్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), ధోనీ, ధావన్, రాహుల్, పాండే, జాదవ్, రహానె, హార్థిక్ పాండ్యా, అక్సర్ పటేల్, కులదీప్ యాదవ్, చాహల్, బుమ్రా, ఉమేష్, మహ్మద్ షమి, శిఖర్, చహాల్, భువనేశ్వర్ కుమార్ లకు ఛాన్స్ ఇచ్చారు. కాకాపోతే స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్,  రవీంద్ర జడేజాలకు అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియాతో టీమిండియా 5 వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ లలో తలపడనుంది. ఫస్ట్ వన్డేను చెన్నై లోని ఎంఏ చిదరంబరం స్టేడియంలో నిర్వహించనున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: