ప్రస్తుతం టీం ఇండియా బాగా బలంగా కనబడుతుంది. అత్యుత్తమ జట్టుగా తమని తాము నిరూపించుకున్నారు. అందుకే ఐదు వన్డేల సీరీస్ లో ఆ జట్టు చేతిలో ఎన్నడు లేని విధంగా 1-4 తేడాతో ఓడిపోయాం అంటూ చెప్పుకొచ్చాడు స్టీవ్ స్మిత్. ఇక జరుగనున్న టి20 మ్యాచులలో తమ సత్తా చాటుతామని అంటున్నాడు. అంతేకాదు టి20 సీరీస్ కైవసం చేసుకుని ఆ ట్రోఫీతోనే ఇంటికి వెళ్తాం అంటున్నాడు స్మిత్. 


వన్ డేల్లో ఆస్ట్రేలియా జట్టుని చిత్తుగా ఓడించింది టీం ఇండియా. ఇక ఆ ఉత్సాహంతోనే టి20కి సిద్ధమవుతున్నారు. శనివారం రాంచిలో మొదటి టి20 మ్యాచ్ జరుగబోతుంది. మరి ట్రోఫీ తీసుకునే వెళ్తాం అని చెబుతున్న స్మిత్ మాటలు నిజం అవుతాయా కాదా అన్నది సీరీస్ ముగిస్తేనే కాని తెలియదు. ఇండియాకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఆస్ట్రేలియా జట్టు కృషి చేస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: