ఇండియా న్యూజిల్యాండ్ మధ్య జరిగిన 2వ వన్ డేలో టీం ఇండియా విజయ ఢంఖా మోగించింది. అయితే ఈ మ్యాచ్ విశేషం ఏంటంటే కివీస్ పై ఈ మ్యాచ్ తో కలిపి 100 వన్ డేలు ఆడిన టీం ఇండియా 50 విజయాలను సొంతం చేసుకుంది. ఇక శ్రీలంక మీద అత్యధికంగా ఇండియా 88 విజయాలను సొంతం చేసుకుంది. ఇదే క్రమంలో వెస్టిండీస్ పై 56, ఇంగ్లాండ్ పై 52, పాకిస్థాన్ పై 52, జింబాంబ్వేపై 51 విజయాలను సొంతం చేసుకుంది.


ఇక వన్ డేలలో ఐదు జట్లతో 100 వన్ డేలు ఆడిన జట్టుగా ఇండియా సరికొత్త రికార్డ్ నెలకొలిపింది. ఇక కివీస్ పై జరుగుతున్న 3 వన్ డేల సీరీస్ లో చెరో మ్యాచ్జ్ విన్ అవగా సీరీస్ 1-1తో సమం చేశారు. ఇక ఈ నెల 29న జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారికి సీరీస్ సొంతం అవుతుంది. ఆస్ట్రేలియాపై సీరీస్ సొంతం చేసుకున్న ఇండియా కివీస్ పై సీరీస్ విజయం సాధించాలని చూస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: