తెలుగు బ్యాట్మింటన్ క్రీడాకారిణి రియో ఒలంపిక్స్ లో రజిత పతాకం తెచ్చిన పివి సింధు అన్ని సమయాల్లో తన దూకుడు ఆటతీరుని ప్రదర్శిస్తూ అందరి ప్రశంసలు పొందుతూ వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో కూడా సెమీస్ వరకు అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన సింధు సెమి ఫైనల్స్ లో జపాన్ క్రీడాకారిణి యమగుచి చేతిలో ఓడిపోయింది.


వరుస రెండు సెట్లలో 21-14,21-9 తేడాతో పరాజయ పాలైంది పివి సింధు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో చైనా చెన్ యుఫీపై విజయం సాధించిన సింధు జపాన్ పై సత్తా చూపలేకపోయింది. ఈ మ్యాచ్ గెలిచినట్టైతే సింధు ఫైనల్ కు వెళ్లేది. అయినా సరే ఫ్రెంచ్ టోర్నీ లో ఇప్పటివరకు ఆమె ప్రదర్శమ అభినందనీయం.



మరింత సమాచారం తెలుసుకోండి: