న్యూజిల్యాండ్ టి20లో భారత జట్టు ఓడటానికి ధోని ఆటతీరు కారణమని అజిత్ అగర్కర్, వివిఎస్ లక్ష్మణ్ అన్నారు. ధోని టి20లకు గుడ్ బై చెప్పడం మంచిందని కూడా ప్రస్థావించారు. అయితే దీనికి సీనియర్ల నుండి భారీ స్పందన వచ్చింది. అంతేకాదు ఏకంగా ధోని కూడా ఈ విషయంపై తన ఆన్సర్ ఇచ్చాడు. అభిప్రాయం తెలియపరచడంలో తప్పులేదు వాటిని గౌరవించాలని అన్నారు.


దుబాయ్ లో తన క్రికెట్ అకాడెమీ ప్రారంభోత్సవంగా ధోని తనపై వచ్చిన విమర్శకులకు సమాధానం చెప్పాడు. జట్టులో స్థానం సంపాదించడమే అతి పెద్ద ప్రేరణ అని.. ఆడే సమయం ఏడాదా.. 10.. 15 ఏళ్లా ఫలితం కన్నా ఆడే తీరు ముఖ్యమని తాను భావిస్తానని అన్నాడు ధోని. మ్యాచ్ ఫలితం గురించి కూడా తను ఆలోచించనని.. ఒత్తిడికి గురయ్యే అవకాశం ఏమాత్రం ఇవ్వనని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: