ఇండియా శ్రీలంకల మధ్య జరిగిన 3 వన్ డేల సీరీస్ లో శ్రీలంక పై 2-1 తేడాతో సీరీస్ సొంతం చేసుకుంది టీం ఇండియా. జరిగిన 3వ వన్ డేలో టాస్ గెలిచిన ఇండియా బౌలింగ్ ఎంచుకోగా కుల్దీప్ యాదవ్, చాహల్ చెరో 3 వికెట్లు తీసి శ్రీలంకను 215 పరుగులకే ఆలౌట్ చేశారు. ఇక లక్ష్యం చిన్నదే అయ్యే సరికి టీం ఇండియా సునాయసంగా లక్ష్యం చేధించింది.


వైజాగ్ లో జరిగిన ఈ చివరి వన్ డేలో ఇండియాకు సీరీస్ తెచ్చి పెట్టింది. శిఖర్ ధావన్ 100 పరుగులతో పాటుగా శ్రేయాస్ అయ్యర్ 65 పరుగులు చేశాడు. ఇక దినేష్ కార్తిక్ కూడా 25 పరుగులు చేసి జట్టుకి విజయాన్ని అందించారు. 3 వండేల సీరీస్ లో వరుస రెండు వన్ డేలను నెగ్గిన ఇండియా సీరీస్ సొంతం చేసుకుంది. ఇక వరుసగా 8 వన్ డే సీరీస్ లను సొంతం చేసుకుని సరికొత్త రికార్డులను సృష్టించింది ఇండియా. 



మరింత సమాచారం తెలుసుకోండి: