భయంకరమైన ఫాంలో ఉన్న విరాట్ కొహ్లి, రోహిత్ శర్మలు కూడా సౌతాఫ్రికా టూర్ లో చేతులెత్తేయగా అటు బౌలింగ్ చేస్తూనే బ్యాటింగ్ లో కూటా సత్తా చాటుతున్నాడు హార్ధిక్ పాండ్య. ఇక సఫారీతో జరుగుతున్న తొలి టెస్టులో టాప్ ఆర్డర్ అంతా చేతులెత్తేయగా ఒంటి చేత్తో ఇండియాకు ఆమోదయోగ్యమైన స్కోర్ వచ్చేలా చేశాడు హార్ధిక్ పాండ్య. 


ఓ పక్క అవతల వికెట్లు టపాటపా పడుతున్నా సరే హార్ధిక్ పాండ్య నిలకడ ఆటను ప్రదర్శించడం జరుగుతుంది. ప్రస్తుతం క్రీజ్ లో ఉన్న హార్ధిక్ పాండ్య 93 పరుగు చేశాడు. ప్రస్తుతం టీం ఇండియా 199 పరుగులు చేసింది.. 9 పరుగులు కోల్పోయిన ఇండియా క్రీజ్ లో మహ్మద్ షమి కూడా బూమ్రా ఉన్నాడు. 87 పరుగులతో కష్టకాలంలో ఉన్న ఇండియాను హార్ధిక్ పాండ్య నిలబెట్టాడు.    


చూస్తుంటే ఇక తక్కువ స్కోర్ కే ఇండియా ఇన్నింగ్స్ ముగించేలా ఉంది. సఫారీలో సత్తా చాటుతారని ఊహించిన బ్యాట్స్ మన్ అంతా సింగిల్ డిజిట్ కే అవ్ట్ అవగా.. హార్ధిక్ పాండ్యా మాత్రం అదరగొట్టాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: