ఇండియా సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న కేప్ టౌన్ మొదటి టెస్టులో జరగాల్సిన 3వ రోజు మ్యాచ్ క్యాన్సిల్ అయ్యింది. తెల్లవారు ఝామున నుండి వర్షం పడుతుండటంతో మ్యాచ్ టైం వరకు చూసి కొద్దిసేపటికే డే క్యాన్సిల్ అయినట్టు ప్రకటించారు. ఇక స్కోర్ విషయానికొస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 286 పరుగులకు ఆలౌట్ అవగా ఇండియా కూడా 209 పరుగులకే ఆలౌట్ అయ్యారు.


భారత బ్యాట్స్ మన్ లో హార్ధిక్ పాండ్య ఒక్కడే 93 పరుగులు చేసి పరువు నిలబెట్టాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సౌతాఫ్రికాను కూడా రెండు వికెట్లు తీసి ఆల్రౌండర్ ప్రతిభ ప్రదర్శించాడు హార్ధిక్ పాండ్య. బ్యాటింగ్, బౌలింగ్ తో సఫారి జట్టుకి చుక్కలు చూపించాడు హార్ధిక్ పాండ్య. 3వ రోజు వర్షార్పణం కాగా మిగిలిన రెండు రోజుల్లోనే మ్యాచ్ విన్నర్ డిసైడ్ చేస్తుంది.


మొదటి ఇన్నింగ్స్ మొత్తానికే చేతులు ఎత్తేసిన భారత బ్యాట్స్ మన్ పై అభిమానుల ట్రోలింగ్స్ తెలిసిందే. అందుకే టార్గెట్ ఎంతైనా సెకండ్ ఇన్నింగ్స్ భారత జట్టు బ్యాటింగ్ లో పుంజుకుంటుందని అంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ఆడుతున్న సౌతాఫ్రికా ప్రస్తుతం 142 పరుగులు లీడింగ్ లో ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: