సురేష్ రైనా పరుగుల వరదగా పేరు ఉంది..ఐపీఎల్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా ముందు వరసలో ఉన్నాడు రైనా చేసిన పరుగులు 4540..ఐపీఎల్-11వ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ ముగ్గురు ఆటగాళ్ళని హోల్డ్ చేసి పెట్టుకుంది ఆ ముగ్గురు ఆటగాళ్లలో రైనా ఒకడు. అయితే రైనా యో యో పరీక్షలలో పాసై భారత జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు సురేష్ రైనా..దేశవాళీ క్రికెట్లో పరుగులు సాధించలేని కారణంగా సురేష్ రైనా ని దక్షిణాఫ్రికా పర్యటనకి సెలెక్ట్ చేయలేదని బీసిసిఐ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరించాడు.
అయితే రైనా ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 లో ఆడుతున్నాడు..తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐపీఎల్ గురించి చాలా విషయాలు చెప్పాడు..అంతేకాదు ధోనీ మీద సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు..ఇంతకీ రైనా ధోనీ పై చేసిన వ్యాఖ్యలు ఏమిటి అంటే.. సుమారు రెండేళ్ళ తరువాత మళ్లీ ధోనీ నాయకత్వంలో ఆడటం చాలా సంతోషంగా ఉంది..అంతేకాదు చెన్నై సూపర్ కింగ్స్ కి మరోసారి ఆడే అవకాశం దొరకడం ఆనందంగా ఉంది అన్నాడు..
చెన్నై ప్రజల మద్దతు ఎప్పటికీ మరవలేనిది..చెన్నైలో ఎన్నో మ్యాచ్ లు ఆడాము ,గెలిచినవి ఉన్నాయి ,ఓడినవి ఉన్నాయి..ఎప్పుడు మమ్మల్ని అభిమానిస్తూనే ఉన్నారు అని అన్నాడు రైనా..ఫిట్నెస్ మెరుగుపరుచుకుంటున్నాను దేశవాళీ ,ఐపీఎల్ తో పాటు అన్ని మ్యాచ్ లు ఆడటానికి ప్రణాళిక వేసుకున్నాను అని తెలిపాడు రైనా..అయితే ధోనీ మీద ప్రశంసల జల్లు కురిపించాడు..ఐపీఎల్ లో ధోనీ ది బెస్ట్ కెప్టెన్ అని కితాబు ఇచ్చాడు రైనా..ధోనీ సారధ్యంలో ఆడటం వల్ల ఎన్నో విషయాలు తెలుస్తాయి అని తెలిపాడు..రైనా చెప్తున్న మాటలు తాను ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నదో చెప్పకనే చెప్తున్నాయి అయితే ఈ ఐపీఎల్ లో రైనా మళ్లీ పరుగుల సునామీ సృష్టిస్తాడో లేదో చూద్దాం.