భారత్ –దక్షిణాఫ్రికా తోలి టెస్టు మ్యాచ్ పరాజయం పొందటంతో...టీం ఇండియా పై మరింత ఒత్తిడి పెరిగిపోయింది. శనివారం జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ ఆటగాళ్లకి చావో రేవో అన్నట్టుగా మారింది..అందుకోసం ముమ్మరమైన సాధన చేస్తోంది..అయితే రెండో టెస్టులో గనుకా ఓడిపోతే సీరీస్ చేజారిపోవడం ఖాయం.కనీసం డ్రాగా చేసుకున్నా సరే మూడోవ మ్యాచ్ కి అవకాశం ఉంటుంది.

 Related image

ఇప్పుడు ఈ భయంతోనే బ్యాటింగ్‌.. ఫీల్డింగ్‌ కోచ్‌ల నేతృత్వంలో ఆధ్వర్యంలో కటోర సాధన చేస్తోంది..భారత ఆటగాళ్ళు అలుపెరుగని సాధన చేస్తున్నారు...అయితే ఈ సందర్భంలో భారత అగ్రశ్రేణి స్పిన్నర్ అశ్విన్ పేస్ బౌలర్ అవతారం ఎత్తాడు...శనివారం జరగబోయే రెండో రెస్టు మ్యాచ్ సెంచూరియన్ లో జరుగుతుంది..అక్కడ పిచ్ పేస్ బౌలర్ లకి కలిసొస్తుంది..బంతి అనుకున్న రీతిలో స్వింగ్ అవ్వడానికి తోడ్పడుతుంది.

 Image result for centurion stadium

అయితే ఈ మ్యాచ్ లో  భారత్ టీంకి భువి ,షమీ ,బుమ్రా మొదటి మ్యాచ్ లో ఆడారు..రెండో మ్యాచ్‌లో అయితే వీరితో పాటుగా ఉమేష్ యాదవ్ కి చోటు దక్కుతుంది..అయితే ఇప్పుడు అశ్విన్ స్పిన్ ని పక్కన పెట్టి నెట్ లో ఫేస్ బౌలింగ్ సాధన చేస్తున్నాడు..దీనికి సంభందిచిన వీడియో కూడా ట్విట్టర్ లో ఉంది. అశ్విన్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా తన సత్తా చాటిన సందర్భాలు అనేక ఉన్నాయి..అయితే ఇప్పుడు అశ్విన్ జరగబోయే రెండో టెస్టు లో పేస్ బౌలర్ గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు అని అర్థం చేసుకోవచ్చు..మరి ఈ కొత్త ఫంధాలో అశ్విన్ సక్సెస్ అవుతాడో లేదో  శనివారం జరగబోయే మ్యాచ్ లో తేలిపోనుంది  

Image result for india south africa  second test match 2018

మరింత సమాచారం తెలుసుకోండి: