కోహ్లీ రికార్డుల మీద రికార్డులు
సృష్టిస్తున్నాడు..సఫారీలకి చుక్కలు చూపిస్తున్నాడు. ఒక్కో బాలుకు ఒక్కో సమాధానం
చెప్తున్నాడు..సఫారీల పేస్ బౌలర్ ఫిలాండర్ కోహ్లీని మేము సాధారణ ఆటగాడు గా
చూస్తాం..తాను మాకు ప్రత్యేకం కాదు అని అన్న మైండ్ గేమ్ మాటలకి చాలా ఘాటుగానే
బదులిచ్చాడు..
దక్షిణాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ లో ఘోరాతి ఘోరంగా విఫలం అయిన కోహ్లీ..రెండో టెస్ట్ మ్యాచ్ లో మాత్రం ఎంతో దూకుడుగా ఆడుతున్నాడు...రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ ఎన్నో ప్రతిష్టాత్మమైన రికార్డులను బ్రేక్ చేశాడు.. భారత క్రికెట్ దిగ్గజం అయిన సచిన్ దక్షిణాఫ్రికా గడ్డపై సెంచరీ చేసిన ఏకైక భారతీయ ఆటగాడిగా నిలిచాడు అయితే ఇప్పుడు కోహ్లీ ఆ రికార్డుని బద్దలు కొట్టాడు అని చెప్పాలి. అంతేకాదు అత్యంత వేగంగా 53 అంతర్జాతీయ సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్గా కోహ్లీ రికార్డు సృష్టించారు. అంతకుముందు సౌతాఫ్రికా బ్యాట్స్మెన్ ఆమ్లా పేరిట ఉన్న కోహ్లీ దాటేశాడు..
టెస్టుల్లో 14 సెంచరీలు సాధించిన దిగ్గజ కెప్టెన్లు.. బ్రాడ్మ్యాన్, లారా, జయవర్ధనే, క్లార్క్ల సరసన కోహ్లీ నిలిచాడు.అయితే సఫారీల గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్ గా సచిన్ 169 పరుగులతో ఉన్నాడు..ఈ రికార్డును కూడా కోహ్లీ బద్దలు కొట్టేస్తాడు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు సెహ్వాగ్ ట్విట్టర్ లో ఎలా స్పందిస్తాడో అని ఎదురు చూస్తున్నారు అభిమానులు.