ఐపీఎల్
సీజన్ వచ్చస్తోంది..అన్నిజట్లు ఎవరికీ వారు పోరుకు సిద్దమై పోతున్నారు కొన్ని
కోట్లమంది క్రికెట్ అభిమానులు సీజన్ మొదలు కోసం వెయిట్ చేస్తున్నారు..సుమారు
రెండేళ్ళ విరామంతరువాత..ఐపీఎల్లోకి
పునరాగమనం చేస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఫ్రాంఛైజీ ఆటగాళ్ల ఎంపికతో
పాటు..సిబ్బంది విషయంలోనూ ఎంతో ఆచితూచి
అడుగులు వేస్తోంది. ఇప్పటికే మహేంద్రసింగ్ ధోని..సురేశ్ రైనా..రవీంద్ర జడేజాలని తమ పాత టీమ్స్ ఉంచుకోవచ్చు
అనే నిభందన ద్వారా వీరు ముగ్గురుని దక్కించుకుంది..
అయితే
ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ “కోచింగ్ టీమ్” నియమాకాన్ని కూడా పూర్తి చేసింది...ఇదిలాఉంటే ఇప్పటికే బౌలింగ్ కోచ్గా లక్ష్మీపతి
బాలాజీని..బ్యాటింగ్ కోచ్గా మైకేల్ హస్సీ.. ప్రకటించిన ఫ్రాంఛైజీ.. అయితే తమ జట్టు ప్రధాన జట్టు
కోచ్ గా తిరిగి స్టీఫెన్ ప్లెమింగ్ని నియమించాలని నిర్ణయించుకుంది..ఫ్లెమింగ్
ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ లో ఆటగాడిగా 2008 లో తన ప్రతిభ కనబరిచాడు..ఆ తర్వాత
కోచ్ గా భాద్యతలు చేపట్టాడు...
చెన్నై సూపర్
కింగ్స్ నిషేదించబడిన సమయంలూ...సీఎస్కే
స్థానంలో ఐపీఎల్లోకి ప్రవేశించిన కొత్త జట్టు రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్కి
కోచ్గా పనిచేశాడు...తాజాగా చెన్నై పునరాగమనంతో ఆ
జట్టు పక్కకి తప్పుకోగా
మళ్లీ ప్లెమింగ్కే సీఎస్కే మళ్లీ
అవకాశం కల్పించింది. దీంతో
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఎంతో ధీమాగా ఉంది.