ఆసియా టీం బ్యాడ్మింటన్
చాంపియన్షిప్ పై భారత్ కోటి ఆశలు పెట్టుకుంది..సైనా నెహ్వాల్ బరి నుంచీ
తప్పుకోవడం..అదే బాయతలో ప్రణయ్ కూడా ఉండటంతో ఇప్పుడు ఈ టోర్నీ పై తీవ్రమైన
ఉత్కంట నెలకొంది..ఈ నేపధ్యంలోనే భారత్ కి పెను సవాలు ఎదురవుతోంది..అయితే ఈ సమయంలో భారత మహిళల, పురుషుల జట్లు తమ
అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి...మహిళల్లో పి.వి.సింధు, పురుషుల్లో...కిదాంబి
శ్రీకాంత్లపైనే భారత్ ఆశలు పెట్టుకుంది.
గ్రూప్-డిలో ఉన్న పురుషుల జట్టులో శ్రీకాంత్, సాయిప్రణీత్, సుమీత్ రెడ్డి, మను అత్రి, సమీర్ వర్మ ఉన్నారు...అయితే ఈ గ్రూప్ దశలో పురుషుల జట్టు ఫిలిప్పీన్స్తో తన తొలి మ్యాచ్ ని ఆడనుంది..అయితే మహిళలలో సింధు , శ్రీకృష్ణప్రియ, రుత్విక గద్దె..అశ్విని పొన్నప్ప..సిక్కి రెడ్డి..ప్రజక్త సావంత్..సంయోగిత బరిలో ఉన్నారు.. భారత మహిళల జట్టు ముందంజ వేయాలంటే తొలి మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఇప్పుడు గ్రూప్-డబ్ల్యూలో జపాన్, హాంకాంగ్లతో భారత్ తలపడాల్సి ఉంది... అయ్తీ ఈ తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుతాయి...ఈ టోర్నీని మే 20 నుంచి జరిగే ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు క్వాలిఫయర్గా పరిగణిస్తారు.