“భారత్ – దక్షిణాఫ్రికా” మధ్య జరుగుతున్న ఐదో వన్డే మ్యాచ్ లో భారత్
ఓపెనర్ రోహిత్ శర్మ గర్జించాడు..విమర్శకుల నోళ్ళు మూయించాడు..వరుసగా రోహిత్ శర్మ గత
కొన్ని వన్డేలు ఫెయిల్ అవుతూ వచ్చాడు..దాంతో అప్పటి వరకూ...విమర్శలు చేస్తూ వచ్చిన
వారు సైతం రోహిత్ ఈరోజు ఆడిన ఆటకి స్టన్ అయ్యారు..రోహిత్ ని తక్కువ అంచనా వేసిన సఫారీలకి చుక్కలు చూపించాడు..
దక్షిణాఫ్రికాతో ఐదో వన్డేలో రోహిత్ (107 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో) “సెంచరీ” చేశాడు..ముందుగా క్రీజ్లో నిలదోక్కుకోవదానికే ప్రాధన్యత ఇచ్చిన రోహిత్ ఆతరువాత మాత్రం తనవైపు వచ్చే బాల్స్ ని ఏ మాత్రం క్షమించలేదు..మొదటి వికెట్కు ధావన్(34)తో కలిసి 48 పరుగులు జోడించిన రోహిత్....ఆ తర్వాత కోహ్లితో కలిసి 105 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశాడు.అయితే ఈ సమయంలోనే ముందుగా 50 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే “కోహ్లి(36)” రెండో వికెట్గా అవుటైన తర్వాత భారత్ స్కోరులో జోరు తగ్గింది..అనవసరంగా పరుగుకోసం రోహిత్ ఇచ్చిన సూచనతో ముందుకు వెళ్లిన కోహ్లీ రనౌట్గా నిలిచాడు... పెవిలియన్ చేరాడు...ఆ తరువాత అజింక్యా రహానే(8) కూడా రోహిత్ పొరపాటుతో రనౌటయ్యాడు...ఈ సమయంలోనే రోహిత్ తన “సెంచరీ” పూర్తి చేసుకున్నాడు. ఇది రోహిత్ వన్డే కెరీర్లో 17వ సెంచరీ...ఆపై ఎంగిడీ వేసిన అద్భుతమైన బంతికి కీపర్ క్లాసెన్కు క్యాచ్ ఇచ్చిన రోహిత్ అవుటయ్యాడు రోహిత్.. వెంటనే హార్దిక్ పాండ్యా.. కాసేపటికి అయ్యర్ కూడా అవుట్ అయ్యాడు..ధోనీ (13), భువనేశ్వర్ కుమార్(19),గా స్కోర్ నమోదు చేసింది భారత్ ఏడూ వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది.ఇప్పుడు సఫారీల ముందు ఉన్న లక్ష్యం 275