భారత్ కి సఫారీలకి
జరుగుతున్న టీ 20 మ్యాచ్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ వచ్చాయి..దక్షిణాఫ్రికా పర్యటనలో
భాగంగా న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న ఆఖరి టీ-20లో ముందుగా తొలుత
బ్యాటింగ్ చేసిన భారత్.. 173 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అంతకుముందు
ప్రోటీస్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
అయితే వన్డేలలో నిరసపరిచినట్లుగానే ఈ పర్యటనలో మరో మారు విఫల చెంది నిరాశపరిచాడు..కేవలం 11 పరుగులు మాత్రమే చేసి డాలా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు...ఆ తర్వాత సురేష్ రైనా, ధావన్లు సఫారీలపై విరుచుకుపడ్డారు. ఈ దశలో సురేష్ రైనా సఫీరీలకి చుక్కలు చూపించాడు.. రైనా 27 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సుతో 43 పరుగులు చేసి షంషీ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. అనంతరం మంచి ఫాంలో ఉన్న ధావన్(46) రనౌట్గా వెనుదిరిగాడు..
.
అయితే తరువాత వచ్చిన బ్యాట్స్ మెన్స్ ఎవరు కూడా సరైన రీతిలో తమ ప్రతిభని కనబరచలేదు..దాంతో నిర్ణీత ఓవర్లో భారత 7 వికెట్ల నష్టానికి గాను 172 పరుగులు చేసింది..సఫారీల బౌలర్స్ లలో డాలా 3, మోరిస్ 2, షంషీ 1 వికెట్ తీశారు.దాంతో 173 పరుగుల లక్ష్యాన్ని సఫారీల ముందు ఉంచారు భారత ఆటగాళ్ళు..