భారత మహిళా క్రికెటర్ పూజా వస్త్రాకర్ అరుదైన రికార్డు సృష్టించింది..పేటీఎం వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది..ఆసీస్‌తో జరిగిన వన్డేలో హాఫ్‌ సెంచరీతో అదరగొట్టిన పూజా..జట్టులో చివరి స్థానంలో బ్యాటింగ్ కి దిగి అర్ధసతకం సాధించింది...అంతేకాదు తక్కువ స్థానాల్లో బ్యాటింగ్ కి దిగి అర్థ శతకం సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా రికార్డు సాధించారు. ఇప్పటివరకూ న్యూజిలాండ్‌ మహిళా క్రికెటర్‌ దూలాన్‌ పేరిట ఉన్న రికార్డును పూజా వస్త్రాకర్‌ సవరించారు.

 Image result for pooja vastrakar

ఇదిలాఉంటే దులాన్ 2009లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో  తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌ చేసి 48 పరుగులు సాధించారు..ఇప్పుడు అదే తీరులో పూజా పాత రికార్డుని చేధించి...కొత్త రికార్డు నెలకొల్పింది..అంతేకాదు ఈ ఈ క్రమంలోనే తొలి వన్డే హాఫ్‌ సెంచరీ చేసిన పిన్న వయసు భారత క్రీడాకారిణులు జాబితాలో వస్త్రాకర్‌ నాల్గో స్థానంలో నిలిచారు. 18 ఏళ్ల 168 రోజుల వయసులో వస్త్రాకర్‌ ఈ ఘనత సాధించారు. అంతకుముందు వరుసలో తిరుషా కామిని, మిథాలీ రాజ్‌, స్మృతీ మంధానాలు ఉన్నారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: