ఐపీఎల్ పండగ
వచ్చేసింది..క్రికెటర్లకి అభిమానులకి ఇదో పెద్ద పండుగని చెప్పాలి..ఈ మ్యాచ్ ల
ప్రారంభోత్సవం ఎంతో వైభవంగా జరుపుకుంటారు ప్రతీ సారి..ఈ సారి కూడా గత ఏడాది కంటే
కూడా గ్రాండ్ గా జరుపుకోవాలని ప్లాన్ చేశారు..అయితే ఈ సారి బీసీసీఐ చేసిన తప్పిదం
వలన ఇప్పుడు ఎనిమిది జట్ల కెప్టెన్లలో కేవలం ఇద్దరు కెప్టెన్లు మాత్రమే ఈ వేడుకలకి
హాజరవుతున్నారు...మిగతా ఆరుగురు కెప్టెన్లు గైర్హాజరు కానున్నారు.
అయితే దీనికి కారణం వింటే షాక్ అవుతారు..వీరి హాజరు కాకపోవడానికి కారణం కేవలం రవాణా ఏర్పాట్లు సరిగా లేకపోవడం.. మ్యాచ్ రోజే ప్రారంభ వేడుకలు జరగడం రెండో కారణం. గత పదేళ్లుగా ఒక రోజు ముందు ఈ వేడుక జరిగేది. అందరు కెప్టెన్లు పాల్గొనేవారు..మళ్ళీ తిరిగి తమ తొలి మ్యాచ్ జరిగే వేదికలకు వెళ్ళేవారు సమం వృధా కాకుండా ఉండేది కానీ ఈ సారి ఒక రోజు ముందు కేవలం వీడియో షూటింగ్లో సారథులు పాల్గొంటారు. అనంతరం తమ మ్యాచ్ వేదికలకు బయల్దేరతారు.
ఇదిలాఉంటే వచ్చే నెల 7న ఐపీఎల్ ప్రారంభం రోజే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరుగనుంది..దాంతో ముంబై, చెన్నై కెప్టెన్లే ఈ వేడుకలో పాల్గొంటారు...అయితే మిగిలిన కెప్టెన్ల కి వివిధ ప్రాంతాలలో మ్యాచ్ లు జరగడం వలన ప్రయాణ బడలిక జరుగుతుందనే ఉద్దేశ్యంతో వేడుకలకి హాజరు కావడం లేదు..బీసీసీఐ చేసిన తప్పిదం వలన ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది..