భారత టెన్నిస్ స్టార్..లియాండర్ ఫేస్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు..టెన్నిస్ ప్రపంచంలో తానొక స్టార్ అని నిరూపించుకున్నాడు..తన కంటూ చెరిగిపోని ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించాడు.. డేవిస్‌ కప్‌ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో  గాంగ్‌-జీ జాంగ్‌ జోడీని 5-7, 7-6(5), 7-6(3) తేడాతో లియాండర్ పేస్, రోహన్ బోపన్న జోడీ ఓడించింది.దాంతో ఇప్పటి వరకు లియాండర్ 43 సార్లు డేవిస్ కప్ డబుల్స్‌లో గెలిచాడు. పేస్ కంటే ముందు ఇరాన్‌కు చెందిన నికోలా పిట్రాంగిలీ అనే ప్లేయర్ డేవిస్ కప్ డబుల్స్‌లో 42 విజయాలు అందుకున్నాడు...

 Leander Paes eyes world record as India face China in Davis Cup tie

అయితే ఇప్పుడు లియాండర్ ఆ రికార్డును  బ్రేక్ చేశాడు. ఇవాళ డేవిస్ కప్‌లో జరిగిన డబుల్స్ మ్యాచ్‌లో పేస్ జోడి విజయం సాధించింది. బోపన్న, పేజ్ జోడి చైనా జంటపై 5-7, 7-6, 7-6 స్కోర్‌తో విజయాన్ని సాధించింది. చైనాలో జరుగుతున్న డేవిస్ కప్ టోర్నీలో భారత్ ఇంకా వెనుకంజలోనే ఉన్నది. 1-2 పాయింట్ల తేడాతో చైనా ముందుకు దూసుకెళ్లుతున్నది. ఈ టోర్నీలో రెండు రివర్స్ సింగిల్స్ మ్యాచ్‌లు ఇంకా జరగాల్సి ఉన్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: