ఐపిఎల్ లో రోజు రోజుకో
ఉత్ఖంటకరమైన పోరు సాగుతోంది..ఆదివారం
జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ ,బెంగుళూరు టీం ని ఓడించింది....మొదటిగా బ్యాటింగ్
చేసిన రాయల్ చాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల
నష్టానికి 176 పరుగులు చేసింది. ఆ తరువాత చేజింగ్ కి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది...అంతేకాదు 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది..నాలుగు వికెట్లు ఉండగానే విజయం అందుకుంది..
అయితే కెప్టెన్ దినేష్ కార్తీక్ 29 బంతుల్లో 4 ఫోర్లతో 35 నాటౌట్ గా ఉండగా సునీల్ నరైన్ 19 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 50 మెరుపు ఇన్నింగ్స్ తో మెరుపువేగంతో స్కోర్ ని పరుగులు పెట్టించారు..డివిల్లీర్స్..23 బంతుల్లో 1 ఫోర్, 5 సిక్సర్లతో 44, మెకల్లమ్ 27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 43 రాణించగా చివర్లో మన్దీప్...18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37చెలరేగాడు. రాణా, వినయ్లకు రెండేసి వికెట్లు దక్కాయి.
కోల్కతా 18.5 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేయగా ... నితిష్ రాణా..25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 34.. ఆకట్టుకున్నాడు. వోక్స్కు 3, ఉమేశ్కు 2వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నరైన్కి దక్కింది.