బుధవారం జరిగిన మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ జట్టు ఓడిపోవడం పై కోహ్లీ తమ బౌలర్స్ పై అసహనం ప్రదర్శించాడు.. ఇలాంటి చెత్త ఆటని సహించేది లేదంటూ మండి పడ్డాడు..చెన్నై సూపర్ కింగ్స్‌ 206 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని  తమ ఎదురుగా ఉంచినా సరే ఓడిపోవదాన్ని కోహ్లీ సహించలేక పోతున్నాడు ఫలితంగా బౌలర్స్ పై మండిపడ్డాడు..వివరాలలోకి వెళ్తే

 Image result for royal challengers bangalore kohli

చెన్నై కి రాయల్స్ కి మధ్య  మ్యాచ్ జరిగిన తరువాత అనూహ్యంగా కోహ్లీ జట్టు ఓటమిని చవిచూసింది...ఈ మ్యాచ్ లో 74 పరుగులకే చెన్నై నాలుగు కీలక వికెట్లు కోల్పోయిందిఅయినా సరే అనూహ్యంగా పుంజుకుంది విజయాన్ని సాధించింది. అతంతరం మాట్లాడిన కోహ్లీ ఇటువంటి బౌలింగ్ ఆమోదయోగ్యం కాదన్నాడు. భారీ స్కోరును కాపాడుకోలేకపోవడం నిజంగా ఒక సమస్యేనన్నాడు...ప్రత్యర్థి జట్టు వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో ఉన్నప్పుడు దానిని మరింత పెంచాల్సిన బౌలర్లు, వారికి మళ్లీ పుంజుకునే అవకాశాన్ని ఇచ్చారని అన్నాడు.

 Image result for chennai dhoni

అయితే జరగబోయే మ్యాచ్ లలో అయినా సరే బౌలర్లు రాణిస్తారని ఆశిస్తున్నట్టు కోహ్లీ అభిప్రాయ పడ్డాడు..అదేవిధంగా అద్భుతమైన బ్యాటింగ్‌తో చెన్నై జట్టుకు విజయాన్ని అందించిపెట్టిన చెన్నై కెప్టెన్ ధోనీ, అంబటి రాయుడిపై కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. ధోనీ ఈ సీజన్‌లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడని ప్రశంసించాడు..ఈ సారి మా జట్టుపై చెలరేగి ఆడవద్దు అని చివరిగా ధోనీ పై ఫన్నీ కామెంట్స్ చేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: