ఐపీఎల్ సక్సెస్ అన్ని దేశాలకి ఇన్స్పిరేషన్ అయ్యింది ఆ స్పూర్తితో
ఎన్నో దేశాలో సైతం లీగ్ లు
నిర్వహించడానికి ముందుకు వస్తున్నాయి అయితే ఈ క్రమంలోనే అక్టోబర్ లో షార్జా
వేదికగా టీ20 లీగ్ ఏపీఎల్ నిర్వహించేదుకు
అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆసక్తి చూపించింది అయితే భారత ఆటగాళ్ళని కూడా
ఆడించాలని బీసీసీఐ కి విజ్ఞప్తి చేసింది అయితే బీసీసీఐ ఈ విజ్ఞప్తిని పక్కన
పెట్టేసింది..
అంతేకాదు భారత ఆటగాళ్ళు తమ లీగ్ లలో తప్ప మరే ఇతర లీగ్ లలో ఆడరని తేల్చి చెప్పేసింది..మీ ఒక్క లీగ్ కి పంపితే ఇతర దేశాలు కూడా ఆడటం మొదలు పెతుతాయి అయితే అన్ని చోట్లకి మావాళ్ళని పంపడం కుదరదు అని చెప్పేసింది..అయితే మీరు నిర్వహించే లీగ్ కి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది అని తెలిపింది..
అయితే ఈ విషయంలో బీసీసీఐ అధికారి మాట్లాడుతూ భారత ఆటగాళ్ళని తమ టీ20 లీగ్కు పంపాలని అఫ్గనిస్తాన్ అడిగిందని అలా పంపడం కుదరదని చెప్పమని తెలిపారు..భరత్ ఎప్పుడు అఫ్గనిస్తాన్కు అండగా ఉంటుందని హామీ ఇచ్చాము..ఒకరికి అనుమతి ఇస్తే అందరికీ ఇవ్వాల్సి ఉంటుంది అయితే అది సాధ్యమయ్యే పని కాదని అందుకే అనుమతి ఇవ్వలేదని తెలిపారు అధికారి..