యూవీ ఒకప్పుడు ఈ పేరు చెప్తే అభిమానులు ఈలలు,గోలలతో చెలరేగి పోయేవాళ్ళు..బౌలర్ యూవీ కి బంతి వేయాలంటేనే వణికిపోయేవాడు..బంతి యువరాజ్ వద్దకి వెళ్ళాలంటేనే జడిచి పోయేది అలాంటి యూవీ కి ఏమయ్యిందో ఒక్క సారిగా సోషల్ మీడియాలో మొదలు యూవీని తెగ తిట్టిపోస్తున్నారు..నువ్వు అసలు ఆడటం అవసరమా అంటూ దూషిస్తున్నారు .. వివరాలలోకి వెళ్తే..
ఐపీఎల్-11 సీజన్లో ఈ సిక్సర్ల సింగ్ నిలకడలేమి ఫామ్తో సతమతమవుతున్న విషయం తెలిసిందే...అయితే శుక్రవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది...ఈ మ్యాచ్ లో సైతం యూవీ చాలా ఘోరంగా వైఫల్యం చెందాడు..14 బంతుల్లో 14 పరుగులు చేసి రనౌట్గా వెనుదిరిగాడు. దీంతో యువరాజ్ ఈ సీజన్లో అత్యల్ప స్ట్రైక్ రేట్(91.42) కలిగిన బ్యాట్స్మన్(50 అంతకంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ఆటగాళ్లలో)గా చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు..
అయితే ఈ మొత్తం సీజన్లో యూవీ ఆడిన 7 మ్యాచ్లకి గాను కేవలం 64 పరుగులు మాత్రమే చేశాడు...దాంతో యూవీపై అభిమానులకి ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది...దీంతో యువరాజ్ను జట్టు నుంచి తీసేయాలని కోరుతున్నారు. ఇంకొందరైతే మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్ల సరసన చేరి కామెంటరీ చెప్పుకో అని ఘాటుగా విమర్శిస్తున్నారు. యువీ క్రికెట్కు వీడ్కోలు చెప్పడమే ఉత్తమమని, అతని ఆటను చూడలేకపోతున్నామని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు...అయితే ఆటగాడి ప్రతిభ ఒక్కోసారి కనుమరుగు అవుతుంది మళ్ళీ ఒక సందర్భంలో బయటకి వస్తుంది అంటూ యూవీ కి సపోర్ట్ గా మరి కొంతమంది అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు..ఏది ఏమైనా యూవీ ఫాం లో లేకపోవడంతో ఎన్నో అవమానాలని ఎదుర్కోవలసి వస్తోంది అంటున్నారు యూవీని అభిమానించే వాళ్ళు..